“ప్రేమమ్”తో మలయాళంలోనూ, “ఫిదా”తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకుంది. ఈ రెండు భాషల్లోనూ నాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి తమిళనాట మాత్రం నిరాశే ఎదురయింది. తొలి చిత్రం “దియా”, మలి చిత్రం “మారి-2” డిజాస్టర్లుగా నిలవడంతో మూడో చిత్రం “ఎన్జీకే”పైనే తన ఆశలను పెట్టుకుంది. తన అభిమాన కథానాయకుడు సూర్యతో కలసి నటించిన ఈ సినిమా ఇటీవలే తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. రెండు చోట్లా డిజాస్టర్గా మిగిలింది. దీంతో తమిళనాట మూడు వరుస పరాజయాలు చవిచూసి ‘ఐరెన్ లెగ్ హీరోయిన్’ అనే ఇమేజ్ని మూటగట్టుకుంది సాయిపల్లవి. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో సాయిపల్లవికి కొత్త అవకాశాలు కష్టమేనంటున్నారు తమిళ తంబీలు.
ఇక తెలుగునాట రెండేళ్ళ క్రితం భలేగా హవా చాటిన సాయిపల్లవికి ఈ మధ్య ఇక్కడ కూడా కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. ఆమె గత చిత్రం “పడి పడి లేచె మనసు” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడడంతో తరువాత చిత్రం “విరాటపర్వం 1992” పైనే ఆశలు పెట్టుకుంది. రానా కథానాయకుడిగా నటించనున్న ఈ పిరియాడిక్ డ్రామాకి ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సాయిపల్లవి సక్సెస్ ట్రాక్లోకి వస్తుందేమో చూద్దాం.
“త్రిష వీడియో బయటపెడతా…” హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు