వివాదాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘దిశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు వర్మ. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ చంద్ర ఈ సినిమా దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలంటూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దిశా ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా తీయవద్దని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సినిమాను ఆపేలా తగు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దిశా తండ్రి పిటిషన్ వేశారు. దిశాపై లైంగిక దాడి, హత్య, దోషుల ఎన్కౌంటర్ తదితర అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ప్రత్యేక కమిటీ విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
previous post