మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏఏ19గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “అల.. వైకుంఠపురములో” అంటూ ప్రకటించింది చిత్రబృందం. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ రూపొందించనున్న “ఐకాన్” సినిమాలో నటించేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఆలియా భట్ను సంప్రదించినట్టు సమాచారం. అయితే కాల్షిట్ల సమస్య వల్ల ఆలియా “నో” చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో “లోఫర్”లో నటించిన బాలీవుడ్ భామ దిశా పటానిని తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. మరో హీరోయిన్గా నివేదా పేతురాజ్ ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.