యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాహోకి చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తుంది. పాత రికార్డులని తిరగరాసేందుకు సాహో టీం సిద్ధం కాగా, తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ప్రభాస్ గాగుల్స్ పెట్టుకొని ఉన్న లుక్ని ట్విట్టర్ ఇమోజీగా విడుదల చేసింది సాహో చిత్ర బృందం.
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ప్రత్యేక విమానం బుక్ చేసుకోవడం సర్వసాధారణమే. అటువంటి సందర్భాల్లో గంటల లెక్కన విమానాన్ని అద్దెకు తీసుకొంటుంటారు. అయితే ప్రభాస్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం “సాహో” కోసం ఓ ప్రత్యేక విమానాన్ని గంటలు, రోజులు కాకుండా ఏకంగా కొన్ని వారాల పాటు అద్దెకు తీసుకొన్నారన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్నగర్లో సందడి చేస్తోంది. తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో ‘సాహో’ చిత్రం రూపుదిద్దుకోవడంతో ఆ భాషల్లో ప్రచారం కోసం పనికి వస్తుందని ఇలా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ఎప్పుడనుకుంటే అప్పుడు ఏ ప్రాంతానికైనా వెళ్లడానికి వీలుగా ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచినట్లు సమాచారం.
సుడిగాలి సుధీర్ పై రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం