కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మూడు వారాలపాటు అన్ని రకాల దంత పరీక్షలను నిలిపిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడు డా.కె.రాజేశ్ రెడ్డి తెలిపారు.
దంత వైద్యులు కోవిడ్-19 భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను మూడు వారాల పాటు నిలిపివేయాలని రాజేశ్ రెడ్డి వెల్లడించారు.