telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు కరోనాపై కేసీఆర్ సమీక్ష సమావేశం!

KCR cm telangana

గత వారం రోజుల నుంచి తెలంగాణ జిల్లాల పరిధిలో కొత్తగా కరోనా కేసులు నమోదు కానప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. వస్తున్న కేసుల్లో 90 శాతానికి పైగా హైదరాబాద్ పరిధిలోనే వస్తుండటంతో, లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్, కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. తాజా పరిణామాలను చర్చించనున్న కేసీఆర్, దానిని యథాతథంగా అమలు చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts