బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె గత సంవత్సరం పెళ్ళితో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల తరువాత దీపికా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి నటిస్తోంది. రణబీర్కపూర్, దీపికా జంటగా ఒక పెయింటింగ్ కంపెనీకి చెందిన ప్రకటనలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్లో కన్పిస్తూ వైరల్ అవుతున్నాయి. అందులో దీపిక, రణబీర్ మంచి స్నేహితులుగా కనిపిస్తున్నారు. చాలారోజుల తరువాత ఈ యాడ్ జంటగా నటించిన దీపిక, రణబీర్ల కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో చాలాకాలం పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరు బ్రేకప్ అయిపోయిన తరువాత కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రణబీర్సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్తో రిలేషన్షిప్లో ఉన్నారు.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా భర్త రణ్వీర్ సింగ్ కు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో ఆమె నటిస్తే ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారా ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా రణ్వీర్ సింగ్ తనకు ఎలాంటి ఇన్ సెక్యూర్ ఫీలింగ్ లేదని, దీపికను తనకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని స్పష్టం చేశారు.