తెలుగులో స్టార్ హీరోలతో నటించిన బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన అభినయంతో, అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాని నవంబర్ 22, 2009న వివాహం చేసుకున్న ఈ అమ్మడు… పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తి దూరమైంది. ఇంటి పనులతో బిజీగా ఉంటూనే తన కుమారుడు వియాన్ బాగోగులు చూసుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది. అయితే పదమూడేళ్ళుగా వెండితెరకి దూరంగా ఉన్న శిల్పా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇప్పుడు శిల్పా శెట్టి పది కోట్ల రూపాయల యాడ్ను ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించింది అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాను నమ్మని దాని గురించి తాను ప్రచారం చేయలేనని తేల్చిచెప్పింది. ఇంతకీ ఏమిటా యాడ్ అంటే… ఓ స్లిమ్మింగ్ పిల్. ఆ పిల్ వేసుకుంటే నాజూగ్గా, సన్నజాజి తీగలా అయిపోతారని చెప్పడమే ఆ ప్రకటన ఉద్దేశం. ఈ ప్రకటనలో నటిస్తే అక్షరాలా పది కోట్ల రూపాయలు ఇస్తామంటూ శిల్పా ముందు ఆఫర్ పెట్టారు. నిమిషం కూడా నిడివి ఉండని ఆ యాడ్లో నటిస్తే ఎంచక్కా పది కోట్లు వస్తాయని తెలిసినా శిల్ప మరో ఆలోచన లేకుండా తోసిపుచ్చింది. ఆ ప్రకటన చేయడం తన వల్ల కాదని, మరొకరిని చూసుకోవాలని తేల్చి చెప్పింది. తాను నమ్మని వాటిని ఇతరులతో కొనిపించలేనని శిల్ప పేర్కొంది. స్లిమ్మింగ్ పిల్స్ వేసుకుంటే తక్షణం ఫలితం కనిపిస్తుందని తాను చెప్పలేనంది. “స్లిమ్మింగ్ పిల్స్… తక్షణ ఫలితాలను హామీ ఇస్తున్నందు వల్ల ఆకర్షించవచ్చు… కానీ మీ అనునిత్య, ఆహార హక్కుకు కట్టుబడి ఉండటం గర్వకారణమనే భావాన్ని ఏదీ అధిగమించలేదు” అని శిల్ప పేర్కొంది.