telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్

Mahesh-Babu

అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేసి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’ అవ్వగానే వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ, వంశీ స్క్రిప్ట్ లేట్ అయ్యింది. అయితే, ఈ గ్యాప్‌లో మహేష్.. పరశురామ్ సినిమాని ఫైనల్ చేసారు. మహేష్ ఎన్ని సార్లు మార్పులు చెప్పినా ఓపికగా చేసి, చివరికి తన స్క్రిప్ట్‌ని ఓకే చేయించుకున్నారు పరశురామ్. ఇక హీరోయిన్‌గా రష్మికని పరశురామ్ సూచించగా మహేష్ మాత్రం కియారాని ప్రిఫర్ చేసినట్టు సమాచారం. ఒకవేళ కియారా కాకపోయినా హిందీ రైట్స్‌ని దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ హీరోయిన్‌నే తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఈ లోగా త్రివిక్రమ్‌తో నమ్రత సెట్ చెయ్యాలి అనుకున్న ప్రాజెక్ట్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లైన్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఈ సినిమా అయ్యేలోపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకుని వస్తే మహేష్ మిగతావన్నీ పక్కనబెట్టి అటు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Related posts