telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ !

lockdown corona

గుంటూర్ జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 541కి చేరింది. పట్ణణంలోని అన్ని ప్రాంతాలకు, మండలంలోని గ్రామాలకు వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు ప్రకటించారు.

లాక్‌డౌన్‌ నుంచి మందుల షాపులు, పాల బూత్‌లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. బ్యాంకులు, ప్రైవేటు ఆస్పత్రులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య సేవలు ఒక్క ప్రభుత్వ అసుపత్రిలోనే అందుబాటులో ఉంటాయి. పది రోజుల పాటు సకలం బంద్‌ అమల్లో ఉంటుంది. ముందస్తు చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.

Related posts