తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,924 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో పది మంది కరోనాతో మృతి చెందారు. 1,638 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,090 కి చేరింది. ఆసుపత్రుల్లో 31,284 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 90,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 818కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 461 మంది కోవిడ్ భారీనపడ్డారు.