తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో కూడా విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రతిరోజు 2,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,239 కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనాత మృతి చెందగా, 2,281మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,52,441 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,091కు చేరింది. ప్రస్తుతం 30,334 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 316 కేసులు నమోదయ్యాయి.
వంశీ చెబుతున్న వెబ్సైట్లతో నాకు సంబంధం లేదు: లోకేశ్