ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.
రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి రామయ్య పెద్ద కుమార్తె ఉమను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రామయ్యను శాలువాతో సన్మానించిన సీఎం.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతర వేడుకలకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ పాలన ఎలా ఉందో చెప్పాలని ఆయన్ను అడిగారు.
ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు..


