telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సాక్షాత్తు సీఎం .. ఓటర్లకు డబ్బులు పంచుతూ..

cm distributing money to voters caught

సాక్షాత్తుగా ఓటర్లకు డబ్బులు పంచుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కెమెరాకు చిక్కారు. రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి పాంప్లెట్లలో డబ్బులు పెట్టి తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు.

మహిళకు సీఎం డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది. తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయంలో పోలీసులు రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

Related posts