telugu navyamedia
క్రీడలు వార్తలు

రోహిత్ రనౌట్ పై స్పందించిన క్రిస్‌ లిన్‌

ఐపీఎల్ 2021 సీజన్‌కు ముంబై ఇండియన్స్ ఆటగాడు డికాక్ లేటుగా రావడంతో ప్రస్తుతం అతడు క్వారంటైన్ గడుపుతున్నాడు. దీంతో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి లిన్ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే ఇద్దరి జోడీ బాగానే ఆడుతుందనకుంటున్న సమయంలో సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ రనౌట్ అయ్యాడు. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం క్రిస్‌ లిన్‌ మాట్లాడాడు. ‘నేను కొంచెం భయపడ్డాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముంబైకి ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. రోహిత్‌ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం కూడా తొలిసారే. దీంతో తొలుత కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. నిజానికి ఆ బంతికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్‌ అయ్యాడు. ఒకవేళ అవకాశం ఉంటే.. కెప్టెన్‌ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని’ అని క్రిస్‌ అన్నాడు. అలాగే ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్‌ అవుతుందేమో అని తెలిపాడు.

Related posts