ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శివ కందుకూరి ప్రధాన పాత్రలో శేష్ సింధూ రావ్ తెరకెక్కిస్తున్న చిత్రం “చూసీ చూడంగానే”. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, మాళవికా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలతో అబ్బాయి నడిపే ప్రేమ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తాజాగా విడుదలైన టీజర్ని బట్టి తెలుస్తుంది. రాజ్ కందుకూరి సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ‘చూసీ చూడంగానే’ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వా సాహిత్యం అందించారు. పవిత్ర లోకేష్,రాజేష్ ఖన్నా, వెంకటేష్ కాకుమాను, అనీష్, గురు రాజ్ ఇతర పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ మూవీ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ను మీరు కూడా వీక్షించండి.
previous post