కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో మూగ జీవాలను గురించి పట్టించుకునే నాధుడు లేడు. ముఖ్యంగా వీధి కుక్కలు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. వీధి కుక్కల దుస్థితికి చలించిపోయిన బుల్లితెర యాంకర్ రష్మీ తానే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కుక్కలకు ఆహారం, నీళ్లు అందించింది. అందరూ సమీపంలో ఉన్న మూగ జీవాలకు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేసింది. రష్మీ చేసిన పనికి అందరూ అభినందిస్తుంటే ఓ ఆకతాయి మాత్రం ‘రోడ్డు మీద ఉన్న కుక్కలకు ఫుడ్ పెడుతున్నావ్ మంచిదే.. మా ఇంటి పైన ఓ కుక్క ఉంది దానికి కూడా పెడతావా.. ఊరికే అది నా ఇంటర్నెట్ కేబుల్ తింటుంది’ అని ట్వీట్ చేసాడు. ‘మీకు కాళ్లు చేతులు లేవా.. కొంచెం రైస్ పెడితే మీ ఆస్తి మొత్తం పోతుందా.. మీకంటే పేదవాళ్లు వెయ్యిరెట్లు బెటర్.. వాళ్లు తినే ఒక రోటీలో కూడా సగం పక్షులకు పెడతారు.. మీరేమో ఇంటర్నెట్ కేబుల్ గురించి టెన్షన్ పడుతున్నారు’ అంటూ రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Yeh mee kalu chetulu leva
Koncham rice pedathe me aasthi motam potada
Mee kana pedevalu 1000 times better
Vaalu teena okka roti lo kuda sakham pashul ki petatunaru
Meru internet cable gurunchi tension padatunaru https://t.co/LBRB3bi1fJ— rashmi gautam (@rashmigautam27) April 6, 2020
హీరో సిద్ధార్థ్ పై నయనతార బాయ్ ఫ్రెండ్ అసహనం