telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చారిత్రక కట్టాడాలపై కరోనా ప్రభావం..చార్మినార్, గోల్కొండ మూసివేత

charminar golkonda

చారిత్రక కట్టాడాలపై కరోనా ప్రభావం పడడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పురాతన కోటలను నేటి నుంచి మూసివేశారు. హైద్రాబాద్ లోని గోల్కొండ కోట, చార్మినార్ తో పాటు వరంగల్ కోటలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జూ పార్కు, లుంబినీ, ఎన్టీఆర్ పార్కులు, ప్రదర్శనశాలలు మూతపడిన సంగతి తెలిసిందే.

వచ్చే నెల 2 న శ్రీరామనవమి పర్వదినం భద్రాచలంలో స్వామివారి కల్యాణం అర్చకులకు మాత్రమే పరిమితం కానుంది. ఏటా భక్తుల జయజయధ్వానాల మధ్య వేడుకగా జరిగే కల్యాణం, ఆలయ చరిత్రలో తొలిసారిగా అత్యంత నిరాడంబరంగా, పూజారులు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుంది. ఇక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించే ఉగాది వేడుకలనూ నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts