telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఆఫ్రికాలో అగ్ని ప్రమాదం.. పలువురు భారతీయుల మృతి!

fire building

ఆఫ్రికా దేశంలోని సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖార్తూమ్ లోని పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ప్రమాదం చోటుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కర్మాగారంలో దాదాపు 50 మంది భారతీయులు పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని వెల్లడించింది.ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో లో అగ్ని ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడంతో ప్రాణ నష్టం భారీగా పెరిగిందని తెలుస్తోంది. పేలుడుకు సంబధించిన వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయకపోడం వల్ల కూడా ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

Related posts