telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం…దూరంగా కేశినాని !

Lokesh chandrababu

ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. దర్గాలోకి వెళ్లి ప్రార్ధనలు నిర్వహించిన చంద్రబాబు… అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, కేశినేని శ్వేత వచ్చారు. అయితే.. విజయవాడలో చంద్రబాబు చేపడుతోన్న ప్రచారానికి కేశినేని నాని దూరంగా ఉన్నారు. చంద్రబాబు సూచనలతో కేశినేని నాని ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా.. కేశినేని నానిపై బుద్దా వెంకన్న, బోండా ఉమ నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. కేశినేని నాని కారణంగా టీడీపీ నాశనం అవుతోందని నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనిపై టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి వివాదాన్ని చల్లార్చింది. ఇది ఇలా ఉండగా.. టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేత బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

Related posts