telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షనీయం : చంద్రబాబు

chandrababu tdp ap

మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షనీయం న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలింది అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్ సీఎంకి చెంపపెట్టు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేయడం హర్షణీయం. అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని నిరూపించింది. పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు, వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చింది. వేతనాలివ్వకుండా పెడుతున్న అవస్థల నుండి స్వాస్థత కల్పించింది. గజపతి రాజుల వంశ ప్రతిష్టకు మసిపూయాలనుకున్న ఏ-1 రెడ్డి దుర్మార్గాన్ని నిలువరించింది. అధికారం ఉందని అడ్డగోలు జీవోలిస్తే.. న్యాయం, చట్టం చూస్తూ ఉండవనడానికి నేటి తీర్పు నిదర్శనం. అలుపెరుగక న్యాయ పోరాటంతో ట్రస్టును కాపాడుకోవడం అశోక్ గజపతిరాజు గారితో పాటు.. ట్రస్టు ద్వారా ఆదరింపబడుతున్న అందరి విజయం. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమం. సింహాద్రి అప్పన్న అండగా ఉన్నంత వరకు న్యాయం ధర్మం చట్టం ఏకమై తాట తీస్తాయని జగన్ రెడ్డి తాట తీస్తాయని గుర్తుంచుకోవాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కోర్టులతో ఇన్నిసార్లు తలంటించుకున్నది లేదు. కోర్టులిచ్చే తీర్పులతో అయినా.. జగన్ రెడ్డి మూర్ఖత్వం వీడాలి. అధికారులు గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ఈ తీర్పుతో నైనా కనువిప్పు కలగాలి.

Related posts