ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిని ఆయన కుమారుడు లోకేశ్ ను జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ తండ్రీ కొడుకులను కటకటాల వెనక్కు పంపాలని జగన్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
సీఎం తెలుగుదేశం పార్టీ నాయకుల భద్రతను తగ్గించారని ఆరోపించారు. టీడీపీ ముఖ్య నేతలను చంపాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, తమను ప్రజలే రక్షించుకుంటారని దేవినేని పేర్కొన్నారు.

