telugu navyamedia
ఆంధ్ర వార్తలు సినిమా వార్తలు

చంద్ర బాబు అభ్యర్ధనను కాదన్న రజనీకాంత్

విజయవాడ నగరంలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి . ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు టి .డి .జనార్దన్ నాయకత్వం లో ఈ వేడుకలను నిర్వహించారు . రామారావు గారు శాసన సభలో చేసిన ప్రసంగాలు , బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఈ కమిటీ తీసుకువచ్చింది .
తెలుగు దేశము పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు , అల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్  యువరత్న నందమూరి బాలకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్ ఎస్ .వెంకట నారాయణ , నందమూరి మోహన కృష్ణ, నందమూరి రామకృష్ణ , గార పాటి లోకేశ్వరి ఈ వేడుకల్లో అతిధులుగా పాల్గొన్నారు.

నందమూరి తారక రామారావు జీవితం పై నాజర్ కుమారుడు బాబ్జి రూపొందించిన బుర్రకథను , సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన .’మనదేశం’ , ‘ మాయాబజార్ ‘ స్కిట్ లకు గుమ్మడి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు , కంఠంనేని రవిశంకర్ రూపొందించిన ‘ తెల్ల అన్నం ‘ షార్ట్ ఫిలిం , అట్లూరి నారాయణ రావు రూపొందించిన ‘ జయహో ఎన్ .టి .ఆర్. పాట , ఎన్ .టి ఆర్ . జీవితంపై రూపొందించిన ఆడియో విసువల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .
అత్యంత భారీగా రూపొందించినఎన్ .టి .ఆర్ శత జయంతి కార్యక్రమానికి 50 వేలమంది ప్రేక్షకులు వచ్చారు . సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు రావడంతో ప్రేక్షకులు అనడంతో , ఉద్వేగంతో కేరింతలు కొట్టారు . అరగంటకు పైగా తెలుగులో సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకున్నది . రజనీకాంత్ 47 సంవత్సరాల తరువాత విజయవాడ వచ్చారు . 1976లో కె .బాల చందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని ‘ కథ సినిమా శత జయంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు . 47 సంవత్సరాల తరువాత రజనీ రావడం తెలుగులో అనర్గళంగా మాట్లాడటం , సీనియర్ ఎన్ .టి .ఆర్ తో , చంద్ర బాబు నాయుడుతో తనుకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ముఖ్యంగా చంద్ర బాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరమని రజనీకాంత్ చెప్పారు .

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తమ తండ్రి ఎన్ .టి .ఆర్ శత జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు .
కమిటీ అధ్యక్షుడు టి .డి .జనార్దన్ మాట్లాడుతూ తమ కమిటీ గత ఎనిమిది నెలల నుంచి శ్రమిస్తుందని , అన్న నందమూరి తారక తామారావు ఔన్నత్యాన్ని , వ్యక్తిత్వాన్ని భావితరాలకు తెలియజేయాలనే సంకల్పం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు .
చంద్ర బాబు నాయుడు మాట్లాడుతో రామారావు గారి ప్రభావం తన మీద ఉందని , ఆయన ప్రాభవాన్ని ఇంత ఘనంగా తెలియజేసి వారికి నివాళులు అర్పించాడని కారణమైన కమిటీ అధ్యక్షుడు టి .డి జనార్దన్ , షరీఫ్ ,రావుల చంద్ర శేఖర్ రెడ్డి , అట్లూరి అశ్విన్, కంఠంనేని రవిశంకర్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్ , భగీరథ , అట్లూరి నారాయణ రావు , మండవ సతీష్ , డి . రామ్మోహన్ , శ్రీపతి సతీష్ , రఘురాం, , మధుసూదన రాజు , పారా అశోక్ ను పేరు పేరున అభినందించారు .
శ్రేయాస్ వారు సారధ్యం వహించగా ఈ భారీ కార్యక్రమానికి సుమ కనకాల వ్యాఖ్యానంతో సాగింది .
అదే రజనీ ప్రత్యేకత :
ఈ కార్యక్రమానికి రావలసిందిగా నారా చంద్ర బాబు నాయుడు గారు తలైవా రజనీ కాంత్ ను ఆహ్వానించారు . చంద్ర బాబు నాయుడు గారి మీద గౌరవంతో రజనీకాంత్ విజయవాడ సభకు వస్తానని చెప్పారు అయితే ఏప్రిల్ 28న ఆయనకు సినిమా షూటింగ్ వుంది , నిర్మాత , దర్శకుడు ను పిలిచి ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ చెయ్యమని చెప్పారు . రజనీకాంత్ చెన్నయ్ నుంచి విజయవాడ రావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని చంద్ర బాబు నాయుడు గారు రజనీకాంత్ కు ఫోన్ చేసి చెప్పారు . అయితే రజనీకాంత్ చంద్ర బాబు నాయుడు అభర్ధనను సున్నితంగా తిరస్కరించారు . తాను ప్రత్యేక విమానంలో రానని , రెగ్యులర్ విమానంలో అందరి ప్రయాణికుల్లా వస్తామని చెప్పారు . అదికూడా తమ టికెట్ లను తామే కొంటామని , హోటల్ కు కూడా తామే డబ్బు కడతామని చెప్పారు . ఈ మాటతో రజనీకాంత్ ఎంత నిరాడంబరుడో , నిజాయితీ పరుడో అర్ధం అవుతుంది . అల్ ఇండియా సూపర్ స్టార్ గా వున్న రజనీకాంత్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధమవుతుంది .

Related posts