telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చలి తట్టుకోలేక బోర్డర్ లో తెలుగు జవాన్ మృతి…

ఏపీకి చెందినా ఓ జవాన్ చలిని తట్టుకోలేక శనివారం మృతి చెందాడు. జమ్మూకాశ్మీర్ నుంచి ఆయన మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే లోని చంద్రగిరి మండలం, పన పాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్ప నాయుడు,శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా దేశానికి సేవలందిస్తున్నాడు. ఈ ఉదయం జమ్ము-కశ్మీర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో సహచరులు ఆయనకు ప్రధమ చికిత్సను అందించారు. అయితే ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెడ్డప్ప నాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాత్విక్ కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్ప నాయుడుకు ఇటీవల పదోన్నత లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.

Related posts