హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. కాగా ఇప్పుడు “వాల్మీకి” చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల సమితి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “వాల్మీకి” టైటిల్ బోయలను కించపరిచేలా ఉందని, ఈ చిత్రానికి పేరు మార్చేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి నేతలు తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. చిత్ర యూనిట్ ఇప్పటికైనా స్పందించి టైటిల్ మార్చాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని బోయ హక్కుల నేతలు హెచ్చరించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
next post