telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో స్టార్ కపుల్ కు సీసీబీ సమన్లు

Diganth and Aindrita Ra

కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని విచారించిన సీసీబీ పోలీసులు వారిద్దరి కాల్స్‌డేటా, వాట్సాప్ సందేశాలను సేకరించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా వారిద్దరికి అనేకమంది ప్రముఖులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఈకేసులో నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో ఆమెను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారందరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే సంజనకు మాత్రం 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. తాజాగా కన్నడ నటీనటులు, స్టార్ కపుల్ దిగంత్, ఐంద్రితలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీని ఆధారంగా వీరికి సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు రెయిడ్ చేశారు. అయితే ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Related posts