telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కేథరీన్…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షించి కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది. అయితే తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొకాపెట్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు దక్షిణ భారత సినీ హీరోయిన్ కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్. అనంతరం కేథరీన్ మాట్లాడుతూ… జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని కేథరిన్ ట్రెసా తెలిపింది.అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో ముగ్గురు ( సిద్ధార్థ్ , తమిళ నటులు ఆర్య , అధర్వ మురళి ) తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని ఆమె తన స్నేహితులు మరియు అభిమానులందరినీ అభ్యర్థించింది మరియు సోషల్ మీడియాలో మొక్కలను నాటిన ఫోటోలను రీట్వీట్ చేస్తానని ఆమె చెప్పారు.

Related posts