telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Accident

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడ్డట్టు స్థానికులు వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts