కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. బుధవారం ఢిల్లీలోని సౌత్బ్లాక్లో రాజ్నాథ్ను కలిసిన కేటీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నాగ్పూర్, హైదరాబాద్, రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని తెలిపారు. ఆయా మార్గాల్లో రహదారుల విస్తరణ, స్కైవేల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూములు రాష్ట్ర అప్పగించాలని రాజ్నాథ్ను కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా రాజ్నాథ్తో కలిసి ఉన్న ఫోటోలను కేటీఆర్ తన ట్విటర్ లో షేర్ చేశారు.