telugu navyamedia
క్రైమ్ వార్తలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..

*నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదం
*కల్వర్టును ఢీకొట్టిన స్కార్పియో కారు, ముగ్గురు మృతి
*దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన

ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం.. అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

మృతులను కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం, విజయలక్ష్మిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని మద్దిలేటి అయ్యా స్వామి క్షేత్రానికి వెళ్లి.. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో  వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related posts