పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బీమా సౌకర్యం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు ఈ బీమా గరిష్టంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పొందే వీలుండేది. ఇప్పుడు దాన్ని రూ.5 లక్షల వరకు పెంచారు.
బ్యాంకులు ఖాతాదారులకు సొమ్ము చెల్లించడంలో విఫలమైన పక్షంలో ఈ మేరకు బీమా సౌకర్యం వర్తింపజేస్తారు. దీనికోసం ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరంలేదు. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతోనే నిర్దేశిత గరిష్ఠ మొత్తం వరకు బీమా లభిస్తుంది. పొదుపు, రికరింగ్, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బీమా పొందవచ్చన్నారు.