కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ముందుగా జిల్లాల వరకే బస్సులను నడిపిన అధికారులు ఇటీవల సిటీబస్సులను కూడా రోడ్డెక్కిచ్చింది. తాజాగా సోమవారం నుంచి బస్పాస్లు జారీచేయాలని నిర్ణయించారు. విశాఖ ఆర్టీసీ అధికారులు. మొదటి దశలో మద్దిలపాలెం, ద్వారకా కాంప్లెక్సు, స్టీల్ సిటీ కాంప్లెక్సులలో పాస్లు ఇవ్వనున్నట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం తెలిపారు.
జనరల్, ఎన్జీవో, దివ్యాంగుల పాస్లతో పాటు నెలవారీ సీజనల్ టికెట్లు, స్టీల్ప్లాంట్ ఎక్స్క్లూజివ్ బస్పాస్లు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇంకో వారం తరువాత అన్ని డిపోల్లోనూ పాస్లు జారీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.