telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్యమం.. వైసీపీ పై బుద్ధా వెంకన్న విమర్శలు

ycp jagan with malya meeting said budda

ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు.

‘నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం. చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్నిటినీ ఇంగ్లిష్ మీడియంగా చేసేస్తాం అంటే ఎలా ఎంపీ విజయసాయి రెడ్డి గారు?’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

‘అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హైలైట్. చంద్రబాబు గారు ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పెడతానంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది. కాస్తయినా మీలో సిగ్గు ఉంటే, నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నాను’ అన్నారు.

Related posts