ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవడంతో పర్మినెంట్ ఉద్యోగులు ముందుగా హాజరుకావాలని ఆదేశించామని చెప్పారు. కరోనా కారణంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయామని తెలిపారు. కానీ ఆర్టీసీలో ఎవరినీ విధుల నుంచి తొలగించలేదు, యధావిధిగా కొనసాగుతారని మంత్రి పేర్కొన్నారు.
లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమిత ప్రయాణీకులతో బౌతిక దూరం పాటించే విధంగా బస్సుల్లో సీట్లను అమర్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్ ఆర్టీస అందుబాటులో ఉంచనున్నారు.
అత్తింటివారిపై లాలూ కోడలు సంచలన వ్యాఖ్యలు