కన్నడ నటుడు కిచ్చ సుదీప్ నటించిన తాజా “పహిల్వాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఎస్. కృష్ణ దర్శకుడు. ఈ యాక్షన్ డ్రామాలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల 5 భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సినిమా విజయంపై ధీమాగా ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘పహిల్వాన్’ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం బ్యానర్పై సాయికొర్రపాటి సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ‘పహిల్వాన్’ ఫస్ట్ టికెట్ను పి.వి.సింధు, బోయపాటి శ్రీను ఖరీదు చేశారు.
ఈ సందర్భంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. “చంద్రయాన్ రాకెట్ ప్రయోగంతో ప్రపంచదేశాలను ఇండియా తన వైపు తిప్పుకునేలా చేస్తే.. తన బాడ్మింటన్ రాకెట్తో వరల్డ్ చాంపియన్గా ఎదిగిన పి.వి.సింధు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కన్నడ, తెలుగు ప్రజలు అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉంటుంటారు. మన తెలుగు సినిమాకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను వారి సినిమాలాగానే ఫీల్ అయ్యి చూస్తారు. అలాగే ఒక మంచి కన్నడ సినిమా తెలుగులో విడుదలైతే నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి మంచి ఉదాహరణ ‘కె.జి.ఎఫ్’. అలాగే పహిల్వాన్ను కూడా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. కిచ్చాసుదీప్గారు పాన్ ఇండియా స్టార్. ఆయన ఏ భాషలో నటించినా అక్కడి ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. ఆయన పెద్ద హీరో. అయినా కూడా ఆ బౌండరీలో ఉండరు. మంచి క్యారెక్టర్ వస్తే చాలు ఏ రాష్ట్రానికైనా వెళ్లి నటించి.. ఆ పాత్రకు న్యాయం చేస్తారు. ఆయనలాంటి గొప్ప నటుడు మన దగ్గర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నార్త్, సౌత్ సినిమాలనే తేడాలుండేవి. కానీ ఇప్పుడలా లేవు. అంతా ఇండియన్ సినిమాలే అయ్యాయి. అక్కడి వారు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ వాళ్లు అక్కడ యాక్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా డబ్బింగ్ రేట్స్ చూస్తుంటే మన సినిమాను ఉత్తరాదివారు ఎంత గొప్పగా చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటిగా మారింది. సాయికొర్రపాటి గారితో నాకు మంచి జర్నీ ఉంది. నా ‘లెజెండ్’ సినిమాకు నిర్మాత. ఆయన మంచి మూవీ లవర్. మన తెలుగులో గొప్ప సినిమా చేసి ఇతర భాషల్లో నటీనటులకు చూపించాలనుకుంటారు. అలాగే ఇతర భాషల్లోని గొప్ప సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. ఆయన తాపత్రయానికి ఉదాహరణే పహిల్వాన్. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. సుదీప్గారు ఈ సినిమా కోసం చాలా వెయిట్ తగ్గారు. మన హీరోలు కూడా పాత్ర కోసం వెయిట్ తగ్గుతున్నారు. మన ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్, బన్నీ, మొన్నటికి మొన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ కోసం వెయిట్ తగ్గారు. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం 11 కిలోలు తగ్గారు. ఈ హీరోలందరూ బాడీని మౌల్డ్ చేసుకుని నటిస్తున్నారు. అలాగే సుదీప్గారు కూడా పహిల్వాన్ సినిమా కోసం శరీరాకృతిని మార్చుకుని నటించారు. ఆయన ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్… కానీ… : శృతి హాసన్