యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
యోగి అదిత్యనాథ్కు ఓటు వేయని ప్రాంతాలను గుర్తించి అక్కడికి జేసీబీలు, బుల్డోజర్లు పంపుతామని ఆయన అన్నారు. యూపీలో హిందువులంతా ఏకం కావాలని అలాగే యూపీలో హిందువులంతా యోగికి జైకొట్టాలని హాట్ కామెంట్స్ చేశారు.
భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో యోగిబాబా ప్రభుత్వం రాబోతుందని రాజాసింగ్ అన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. బీజేపీకి ఎమ్మేల్యే ఈ వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర కలకలం రేపుతుంది.


తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి