జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఖైదీ సహా నలుగురు గుజరాత్ పోలీసులు సహా ఐదుగురు మృతి చెందారు.
దిల్లీ నుంచి గుజరాత్కు నిందితుడిని తరలిస్తున్న గుజరాత్ పోలీసుల వాహనం జైపూర్లోని భబ్రూ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.