విమానం రన్వేపై టేకాఫ్కు రెడీగా ఉన్న విమానం రెక్కలపై నుంచి ఓ వ్యక్తి ఎక్కడం చూసి షాక్ అయ్యారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు. ఈ షాకింగ్ ఘటన నైజీరియా విమానాశ్రయంలో శుక్రవారం జరిగింది. అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం… లాగోస్లోని ముర్తల మహ్మద్ ఎయిర్పోర్టులో శుక్రవారం ఉదయం 10.09 గంటల ప్రాంతంలో(లోకల్ టైం) ఈ జరిగినట్టు అధికారులు తెలిపారు. రన్వేపై టేకాఫ్కు రెడీగా ఉన్న విమానంవైపు హఠాత్తుగా ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. అనంతరం రెక్కపై నుంచి లోపలికి ప్రవేశించేందుకు యత్నించాడు. అది గమనించిన పైలట్ వెంటనే విమానం ఇంజిన్ ఆఫ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. విమానాశ్రయ అధికారులు కూడా అతడ్ని వెంటనే ఏమీ చేయలేదు. ఎందుకుంటే విమానంలో ప్రయాణీకులు ఉన్నారు. తప్పించుకునే క్రమంలో అతడు ప్రయాణీకులకు హాని తలపెట్టొచ్చని ఆలోచించి తొందరపడలేదు. ఆ తరువాత విమానాశ్రయ సిబ్బంది 37 నిమిషాల పాటు శ్రమించి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వ్యక్తి చర్యను ప్రయాణీకులు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో వైరల్గా మారింది.
అమరావతి నేల నిర్మాణాలకు అనుకూలం కాదు: విజయసాయిరెడ్డి