telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

చెల్లె పైనే అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడు…

మన దేశంలో ఆడపిల్లల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కనీసం వారి ఇంట్లో కూడా వారికీ భద్రత ఉండటం లేదు. యతే చెల్లెలు పై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  గ్రామంలో ఎస్సి కాలనీకి చెందిన శ్రీరాములు, రామలక్ష్మి దంపతుల మూడవ కుమార్తె (19) ఇంటిపట్టునే ఉంటోంది. తన కోరిక తీర్చుకోవాటానికి మాటు వేసిన అదేకాలనీకి చెందిన లక్షమన్న అనే వ్యక్తి యువతికి వరుసకు అన్న అయినప్పటికీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మాటవినని యువతి నోటిలో గుడ్డలు కుక్కి బలవంతం చేశాడు. కూలి పనులకు వెళ్లి వస్తున్న తల్లికి కూతురు కేకలు వినిపించడంతో తలుపు తీయగా లక్షమన్న పారిపోయాడన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన యువతిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి పై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు.

Related posts