ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు.గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంతలా పాలిస్తున్న జగన్, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంగ్లీషు మీడియంలో బోధన అంశంపై ఆయన విమర్శలు చేశారు. మాతృభాషను చంపేసే సీఎంను జగన్నే చూస్తున్నామని మండిపడ్డారు.
ఇంగ్లీషు భాషపై అంత ప్రేమ ఉంటే, ప్రత్యేక పాఠశాలలు పెట్టుకోవాలని అన్నారు. ‘ఇంగ్లీషు’ వద్దని ఎవరూ చెప్పలేదని, మాతృభాషను చంపొద్దంటున్నామని అన్నారు. టీడీపీ పాలనలో ఇదే అంశాన్ని జగన్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ‘ఇంగ్లీషు’ను నిర్బంధ విద్యగా చేయొద్దన్న విషయాన్ని తెలుగులో చెబుతున్నామని అన్నారు.
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి