telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రాకి బీజేపీ అవసరం చాలా ఉంది .. జేపీ నడ్డా

ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో బేజీపీ శక్తి కేంద్రంలో ప్రముఖలను ఉద్దేశించి నడ్డా మాట్లాడారు. 

విజయవాడలో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అర్జునుడు తపస్సు చేసిన పుణ్యభూమి ఇది అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దిపై సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందని అన్నారు.

కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. కొత్త వారిని పార్టీలోకి తీసుకోవడంపై దృష్టి సారించాలన్నారు.

ప్రధాని మోదీ చేపట్టే మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని బూత్‌ స్థాయి కార్యకర్తలంతా సామూహికంగా వినాలని సూచించారు నడ్డా. ఆయన చెప్పిన సందేశాన్ని ప్రజలతో చర్చించాలన్నారు. కేంద్రంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత శక్తి కేంద్రాల ప్రముఖులకు ఉందని నడ్డా సూచించారు. 

బీజేపీ అంటే ఒక వర్గానికి చెందినది కాదని.. అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని అన్నారు. ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పుస్తకాలు రాష్ట్ర బీజేపీ ప్రింట్ చేసి ప్రజలకు పంచి పెట్టాలన్నారు. 

Related posts