ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లే కాకుండా పార్టీల ఖాతాలు కూడా హ్యాక్ చేస్తున్నారు కేటు గాళ్లు.
తాజాగా…తెలుగుదేశం పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురైంది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు వివిధ రకాల పోస్టులు పెట్టారు. ట్విట్టర్ అకౌంట్ను ఆధీనంలోకి తీసుకున్న హ్యకర్లు.. స్పేస్ ఎక్స్ , ఎలన్ మస్క్లతో కూడిన ట్వీట్స్ చేశారు. ఈ విషయం గుర్తించిన ఐటీ విభాగం.. వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్లో అసభ్య మెసేజ్లు పంపినట్టు గుర్తించింది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్ చేసి వెల్లడించారు. ఈ అకౌంట్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని లోకేష్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
కాగా.. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ ఘటన పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఎవరు చేశారు..? కావాలనే చేశారా..? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
జగన్ వి ఒంటెద్దు పోకడలు: పురందేశ్వరి