ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో వివాదం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
అయితే కొద్ది నిమిషాల్లో భూమా కిషోర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేస్తారనే క్రమంలో ఆ విగ్రహాలను భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి ఆవిష్కరించి, పాలాభిషేకం కూడా చేశారు.
ఈ హఠాత్పరిణామంతో భూమా కిషోర్ రెడ్డి అనుచరులు అవాక్కయ్యారు.భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను వారు ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
గత కొంత కాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండటంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలిసింది.
తల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్యగలను..పరిధులు దాటవద్దు