తిరుమలకు చేరుకున్న నిర్మాత నటుడు బండ్ల గణేష్, సంకల్ప యాత్ర ను పూర్తీ చేశారు .
23 రోజుల లో అడ్డంకులు లేకుండా శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు.
శ్రీవారిని నమ్ముకొని నష్టపోయిన వారు లేరు, నిజాయితీగా శ్రీవారిని కోరుకున్నాను వేంకటేశ్వర స్వామి నా మొర ఆలకించారు అన్నారు.
నా జన్మలో ఇది గొప్ప ఘట్టం, ఈ జన్మంతా శ్రీవారికి సేవలు చేస్తాను అన్నారు.
షాద్నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సంకల్పయాత్ర ప్రారంభించాను, 537 కిలోమీటర్లు సంకల్పయాత్ర చేశాను అని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.

