భారత్ లో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అద్భుత రీతిలో స్వాగతం లభించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో విమానం దిగిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. కరచాలనం, కౌగిలింతతో ప్రధాని ఆహ్వానం పలికారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బర పరిచింది.
శంఖాలు, డప్పు వాయిద్యాలు , సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశర్చపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన బయలుదేరారు.