మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న హాలీవుడ్-ఇండియన్ ఫిల్మ్ ‘మోసగాళ్లు’ షూటింగ్ లాక్డౌన్తో పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా మంచు విష్ణు చేసిన ట్వీట్ చూస్తే తెలుస్తుంది. తన కొడుకు అవ్రామ్తో కలిసి ‘మోసగాళ్లు’ చిత్ర ఎడిటింగ్ వర్క్ చూస్తున్నట్లుగా మంచు విష్ణు ట్వీట్ చేశారు. “అవ్రామ్ మరియు నేను మోసగాళ్లు చిత్ర ఎడిటింగ్ను చూస్తున్నాము. స్ర్కీన్పై కనిపిస్తున్నది ఎవరో.. మీరు గుర్తుపట్టగలరా?’’ అని విష్ణు తన కొడుకుతో కలిసి ల్యాప్ట్యాప్ చూస్తున్న ఫొటోని పోస్ట్ చేశారు. హాలీవుడ్కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కీలకమైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ, విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్ పాల్గొన్న సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్శెట్టితో కలిసి చేసిన క్లైమాక్స్ యాక్షన్ సీన్లతో పాటు అధిక శాతం షూటింగ్ పూర్తయిందని ఆ మధ్య చిత్రయూనిట్ తెలిపింది.
Avram and I watching the edit of #Mosagallu ..Can you guess who’s on the screen? pic.twitter.com/H4pnyHskIX
— Vishnu Manchu (@iVishnuManchu) July 6, 2020