telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రాణహాని ఉందని .. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన.. ప్రణయ్ తల్లిదండ్రులు..

pranay parents to police station for

ప్రణయ్ హత్య ఉదంతం.. గురించి తెలిసిందే. అయితే నేడు ప్రణయ్ పుట్టిన రోజున అమృత మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే మళ్ళీ తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ, ప్రణయ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమ కుమారుడు మళ్లీ పుట్టాడని, తమకు ఎంతో సంతోషంగా ఉందని ప్రణయ్ తల్లిదండ్రులు తెలిపారు. ప్రణయ్ తల్లిదండ్రులు శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 30న అమృతకు కొడుకు పుట్టాడని తెలిపారు. పోలీసులు, మీడియా సహకారంతోనే తమ కుటుంబం బతుకుతోందని చెప్పారు. మిర్యాలగూడలో భద్రత లేకపోవటంతో డెలివరీ కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి వచ్చామని వారు తెలిపారు. నెల రోజులుగా ఎవరీ తెలియకుండా బతుకుతున్నామన్నారు. ఫిబ్రవరి ఒకటిన ప్రణయ్ జన్మదినమని, ప్రణయ్- అమృత పెళ్ళి రోజునే వారికి కొడుకు పుట్టాడని చెప్పుకొచ్చారు.

తన ప్రాణం పోయినా న్యాయం కోసం పోరాడతానని ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పష్టం చేశారు. కులం వలనే తన కుమారుడు హత్య చేయబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆ భయం వల్లే అమృత డెలివరీ విషయాన్ని మీడియాకు చెప్పలేకపోయామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మిర్యాలగూడకు వెళ్తున్నామని, తమకు పోలీసులే రక్షణ కల్పించాలని బాలస్వామి విజ్ఞప్తి చేశారు. మారుతీరావు లాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు.

హైదరాబాద్‌లో అద్దెకు ఇల్లు కావాలంటే ఏ కులమని అడిగారని వాపోయారు. మారుతీరావు భార్య తమ ఇంటికి మీడియేటర్స్‌ని పంపి బెదిరిస్తోందని, తమకు రక్షణ కావాలని ప్రేమలత కోరారు.

Related posts