telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంపీ గోరంట్ల అశ్లీల వీడియో : నిజ నిజాలు నిగ్గుతేల్చండి

*ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసిన మ‌హిళా క‌మిష‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌
*ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకోండి ..
*నిజ నిజాలు నిగ్గు తేల్చాలి డీజీపీకి లేఖ ..

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం‌పై విచారణ జరిపి త‌గిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖ రాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

మరోవైపు.. గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా నిరసనకు దిగాయి. విశాఖలో తెలుగుదేశం మహిళా నేతలు గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

అటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎంపీ మాధవ్ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ.. ఆయనను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. 

Related posts