విశాఖలోని బడా సంస్థలు పెద్దల హస్తగతమవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్. ఇండస్ట్రియల్ విధానంలో నిబంధనల మార్పు ఫార్మా కంపెనీలకు ఉపయోగపడ్డాయా? అని ప్రశ్నించారు.
వాటా కొన్న ఫార్మా కంపెనీలు ఏవి? అప్పులు ఎవరు తీరుస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఏర్పాట్లు నిజమేనా? ప్రజలకి చెప్పండి జగన్ గారూ’ అని ప్రశ్నించారు. దీంతోపాటు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు.