ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా 23న కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా 24న రాయచోటిలో పర్యటించనున్నారు. 25న పులివెందులలో వైద్య కళాశాలతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 24, 25 తేదీల్లో ఇడుపులపాయ, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలసి జగన్ ప్రార్థనలను నిర్వహించనున్నారు.


వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్